న్యూఢల్లీి, మార్చి 25
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదవ జాబితాను బీజేపీ నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నటి కంగనా రనౌత్కి కూడా బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది.హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ను హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీకి దింపినట్లు పార్టీ ప్రకటించింది. చంద్రాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుధీర్ ముంగుంటివార్పై మాజీ ఎంపీ సురేశ్ ధనోర్కర్ భార్య ప్రతిభా ధనోర్కర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిపింది. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ టికెట్ రద్దు కాగా, ఇక్కడి నుంచి జితిన్ ప్రసాద్కు టికెట్ ఇచ్చారు. బక్సర్ నుంచి అశ్విని చౌబే టికెట్ రద్దు చేయగా, పశ్చిమ చంపారన్ నుంచి సంజయ్ జైస్వాల్కు టికెట్ ఇచ్చారు. పూరీ నుంచి సంబిత్ పాత్రకు టికెట్ దక్కింది. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసేందుకు సురేంద్రన్కు టిక్కెట్టు ఇచ్చారు.తూర్పు చంపారన్ నుంచి రాధామోహన్సింగ్కు, బెగుసరాయ్ నుంచి గిరిరాజ్సింగ్కు టికెట్ ఇచ్చారు. ఉజియార్పూర్ నుంచి నిత్యానంద్కు టికెట్ ఇచ్చారు. రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ విూరట్`హపర్ లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యారు.
13రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భైంసాకు చేరుకున్న మంత్రికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుని, పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ప్రియతమ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. సామాన్యుల కోసం పనిచేసే మనిషి రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న హక్కులన్నీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవేనని, అనేక భద్రత చట్టాలను తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను విమర్శించడం తప్పితే బీజేపీ చేసిందేవిూ లేదని అక్షింతలు మన చేతికి ఇచ్చి అధికారం వారు అనుభవిస్తున్నారన్నారు. పదేళ్ల కాలంలో ఏంచేసారో చెప్పలేని బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలను కాపాడుతూ పాలన సాగిస్తుందన్నారు. ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…