న్యూఢిల్లీ: మెగా లీగ్ ఐపీఎల్ ఫైనల్ మే 26న చెన్నై వేదికగా జరుగనుంది. ఈ మేరకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ పూర్తిస్థాయి షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ రెండోదశను యూఏఈకి తరలిస్తారన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ.. భారత్లోనే మిగిలిన మ్యాచ్ల వేదికలను ఖరారు చేసింది. 2011, 2012 తర్వాత చెన్నైలో ఫైనల్ను షెడ్యూల్ చేయడం ఇదే తొలిసారి. డిఫెండింగ్ చాంప్ హోదాలో టైటిల్ ఫైట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం చెన్నైకు దక్కింది. ఒకవేళ సీఎ్సకే ఫైనల్కు చేరితే సొంత ప్రేక్షకుల ముందు ధోనీ ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 24న రెండో క్వాలిఫయర్ మ్యాచ్కు కూడా చెపాక్ వేదిక కానుంది. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో మే 21న క్వాలిఫయర్-1, 22న ఎలిమినేటర్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. తొలి దశలో 21 మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేయగా.. వచ్చే నెల 8 నుంచి జరిగే రెండో దశలో మొత్తంగా 52 మ్యాచ్లు జరగనున్నాయి. పోలింగ్ను దృష్టిలో ఉంచుకొని భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా మ్యాచ్ల తేదీలను ఖరారు చేశారు. పంజాబ్ కింగ్స్ రెండో హోంగ్రౌండ్ ధర్మశాలలో, రాజస్థాన్ రాయల్స్ రెండో సొంత మైదానంగా భావిస్తున్న గువాహటిలో రెండేసి మ్యాచ్లను షెడ్యూల్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ను ఏప్రిల్ 20న సన్రైజర్స్తో ఆడనుంది. మే 19న రాజస్థాన్- కోల్కతా మ్యాచ్తో లీగ్ దశ ముగియనుంది. ఒక రోజు విరామం తర్వాత మే 21 నుంచి ప్లేఆఫ్స్ జరగనున్నాయి.
Trending
- భారత నేవీ సాహసోపేత ఆపరేషన్.. హైజాకర్ల నుంచి పాకిస్థానీలను రక్షించిన కమాండోలు
- సెమీస్లో సిక్కి జోడీ
- నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
- ‘ఓ భామ అయ్యో రామ’.. సుహాస్ ఖాతాలో మరొకటి!
- వెకేషన్ కి వెళుతున్న రామ్ చరణ్, వచ్చాకే శంకర్ సినిమా
- మల్కాజ్ గిరి అందరికి ప్రతిష్టాత్మకం
- ఇంద్రకరణ్ వస్తే సహాయనిరాకరణే…
- కావ్య బాటలో మరో అభ్యర్ధి…